పవన్ ఇది న్యాయంగా ఉందా…!

-

జ‌నసేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాల‌కు తాను పూర్తిగా దూర‌మ‌ని ప్ర‌క‌టించి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో కాలం గ‌డిపారు. అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోవ‌డంతో ఇప్పుడు చేసేదేం లేదు. అటు ప‌వ‌న్ అభిమానులు కూడా ప‌వ‌న్ మళ్లీ సినిమాల్లోకి రావాల‌ని కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తాడ‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఇది నిజం అని కూడా తెలుస్తోంది. ప‌వ‌న్ ఇప్ప‌టికే న‌లుగురు నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్స్‌లు తీసుకున్నారు. వీటిల్లో కొంద‌రు ఎప్పుడో ఏడెనిమిది ఏళ్ల క్రిత‌మే అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఇప్పుడు ఈ అడ్వాన్స్‌లు ఇచ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఖ‌చ్చితంగా సినిమాలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే పవన్ హిందీలో సూపర్ హిట్ అయిన ‘పింక్’ రీమేక్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ రైట్స్ ఇప్ప‌టికే దిల్ రాజు ద‌గ్గ‌ర ఉన్నాయి. తాజాగా ఈ రీమేక్‌కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నడంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాలు చేయాల్సి వ‌స్తే ముందుగా మైత్రీ మూవీ మేక‌ర్స్‌కే చేస్తాన‌ని క‌మిట్ అయ్యాడు. మైత్రి వాళ్ళు ఐదేళ్ల క్రితం ఐదు కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ అడ్వాన్స్ నేప‌థ్యంలో అయినా ప‌వ‌న్ వాళ్ల‌కు ముందుగా సినిమా చేయాల‌న్న డీల్ ఉంద‌ట‌.

ఇక ఏఎం.రత్నం కూడా ప‌వ‌న్‌కు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చాడు. మ‌రి ఈ ఇద్ద‌రిని కాద‌ని.. ఇప్ప‌టికిప్పుడు దిల్ రాజు బ్యాన‌ర్లో సినిమా చేస్తే ఆ ఇద్ద‌రికి అన్యాయం చేసిన‌ట్టే అవుతుంది. మ‌రి ప‌వ‌న్ ముందుగా ఇచ్చిన మాట ప్ర‌కారం మైత్రీ, ఏఎం.ర‌త్నంకు సినిమా చేస్తాడో ?  లేదో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version