గుణశేఖర్ రానా ల “హిరణ్య కశిప” సినిమా మీద ఇంట్రెస్టింగ్ న్యూస్ ..!

-

క్రియోటివ్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి అందరికి తెలిసిందే. తీసింది తక్కువ సినిమాలైనా గుణశేఖర్ అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకత ని చాటుకున్నాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తో చూడాలని ఉంది, మహేష్ బాబు తో ఒక్కడు, అర్జున్, అనుష్క తో రుద్రమదేవి చిత్రాలు గుణశేఖర్ కి దర్శకుడిగా గొప్ప పేరును సంపాదించి పెట్టాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన ఒక్కడు సినిమాకి వేసిన ఛార్మినార్ సెట్, అలాగే అర్జున్ సినిమాలో వేసిన మధుర మీనాక్షి అమ్మవారి సెట్ గురించి ఇప్పటికీ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.

 

Gunasekhar confirms mythological film with Rana

అయితే గుణశేఖర్ తీసిన సినిమాలలో ఎక్కువగా ఫ్లాప్స్ ఉండటంతో ఆయనకి వరసగా సినిమాలు చేసే అవకాశం రావడం లేదు. పైగా ఒక సినిమా అనుకుంటే కథ కి తగ్గట్టు ఖచ్చితంగా సెట్ ఉండాలన్నది ఆయన పట్టుదల. ఆ సెట్ కూడా కథ లో కీలక పాత్ర పోషిస్తుంది. కాని ఒక్క సెట్ కోసమే కోట్లు ఖర్చు చేయడం ఎందుకున్న అన్న ఆలోచనతో చాలా మంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఒక ఆయన గత చిత్రం రుద్రమదేవి కూడా భారీ హంగులతో రూపొందించారు. మంచి టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నా ..బాహుబలి వంటి భారీ తనంతో తెరకెక్కించినా సక్సస్ మాత్రం అనుకున్నంత రాలేదు.

 

దాంతో కొంత గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ గత సంవత్సరం రానా దగ్గుబాటితో హిరణ్య కశిప సినిమాని ప్రకటించారు. భారీ కాన్వాయిస్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో గుణశేఖర్ కూడా భాగస్వామిగా ఉన్నారు. సురేష్ బాబు తో కలిసి గుణశేఖర్ హిరణ్య కశిప సినిమాని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకి పనిచేసేందుకు తెలుగు భాష మీద పట్టున్న కొందరు కొత్త వాళ్ళని ఎన్నుకున్నారు.

కాని కొంతకాలంగా ఈ సినిమా కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని మాట్లాడుకుంటున్నారు. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ఠ్యా ఇక ఈ సినిమా ఉండదని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారానికి ఆదిలోనే తెరదించేందుకు నిర్మాత సురేష్ బాబు వెంటనే స్పందిస్తూ ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఈ సినిమా మీద వస్తున్నవన్ని ఒట్టి పుకార్లేనని క్లారిటి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news