మహేష్ సినిమాలో కలెక్షన్ కింగ్ నిజమేనా..?

-

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక బుల్లితెరపై ఇప్పటికి ఖలేజా సినిమా ప్రసారమైందంటే చాలు టిఆర్పి రేటింగ్ లో మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఈ చిత్రంలో మోహన్ బాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు అందుచేతనే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలుపడడం జరిగింది. ఈ చిత్రంలో ఇతర భాషల నటీనటులను కూడా నటింపజేసే విధంగా త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇతర భాషలలో బాగా గుర్తింపు సంపాదించుకున్న నటులు దొరకకపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే తెలుగులో పాపులర్ అయిన కొంతమంది నటులను తీసుకొని అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

మహేష్ సినిమాలో మోహన్ బాబు నటిస్తే.. ఈ సినిమా పైన కచ్చితంగా భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉందని మహేష్ బాబు అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దాదాపుగా కొన్ని కొట్లు రూపాయలకు పైగా బడ్జెట్లో తెరకెక్కిస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా రూ.320 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే త్రివిక్రమ్ కూడ మోహన్ బాబు ను సంప్రదించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news