సర్కారు వారి పాట కి నమ్రత ఆ హీరోయిన్ ని తీసుకోమని అంటుందా ..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో నటిస్తున్న 27 వ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్ధిక నేరస్తుడుగా కనిపించబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయట. 7 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు థమన్ కాంబినేషన్ కావడంతో ఖచ్చితంగా సూపర్ హిట్ ఆల్బం ఇవ్వాలని థమన్ పట్టుదలతో కొత్తరకమైన ట్యూన్స్ ని కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట.

 

ఇక ఈ సినిమాని ఆగస్టు సెకండ్ వీక్ లో సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఆగస్టు గనక కుదరకపోతే అక్టోబర్ నుంచి వెళ్ళేలా కూడా మరో ప్లాన్ చేస్తున్నారట. అన్ని బాగానే ఉన్నాయి గాని ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ విషయమే మేకర్స్ ని ఇబ్బంది పెడుతుందని చెప్పుకుంటున్నారు.

వాస్తవంగా ఈ సినిమాలో ముందు నుంచి కియారా అద్వాని, కీర్తి సురేష్ పేర్లు ప్రచారం లో ఉన్నాయి. కాని ఈ ఇద్దరు ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి డేట్స్ సర్ధుబాటు చేసే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. దాంతో మరో ఆప్షన్ గా సాయి మంజ్రేకర్ ని అనుకుంటున్నారట. మహేష్ మంజ్రేకర్ కూతురైన ఈ బాలీవుడ్ బ్యూటి సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 లో నటించిది. అయితే ఈ అమ్మడిని సర్కారు వారి పాట లో తీసుకోమని మహేష్ బాబు సతీమణి నమ్రత సూచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం నమ్రత కి సాయి మంజ్రేకర్ కి ఉన్న పర్సనల్ రిలేషన్ అని తెలుస్తుంది. అంతేకాదు ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి రెమ్యూనరేషన్ పరంగాను బెటరని ఆలోచిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news