పూజా హెగ్డే కెరియర్ ఇక ముగిసినట్టేనా..?

-

డీ జే.. సినిమా ద్వారా ఓవర్ నైట్ లోని బుట్ట బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే ఆ తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోయిన్ వరుస విజయాలు అందుకుంటుంది అంటే మిగతా హీరోలు, స్టార్ డైరెక్టర్లు , ప్రొడ్యూసర్లు కూడా ఆ హీరోయిన్ చుట్టూ తిరుగుతారు.. ఇలా వరుస అవకాశాలను సొంతం చేసుకున్న ఎంతో మంది స్టార్ హీరోయిన్ల పరిస్థితి.. క్రేజ్ తగ్గాక చిత్రంగా మారుతోంది. ఇప్పుడు ఇదే పరిస్థితిని క్రేజీ హీరోయిన్ బుట్ట బొమ్మ కూడా అనుభవిస్తూ ఉండడం గమనార్హం. తెలుగులో డీజే దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది . ఇక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా వరుస క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

2017 నుంచి 2020లో బన్నీ హీరోగా రూపొందిన అలవైకుంఠపురంలో సినిమా వరకు ఈమె క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. ఇక హీరోయిన్గా పూజా హెగ్డే కి మంచి క్రేజ్ ను.. సరికొత్త ఇమేజ్ను తీసుకొచ్చింది. ఈ సినిమాతో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. ఆ క్రమంలోనే అఖిల్ తో కలిసి నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా పర్వాలేదనిపించింది. తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్, విజయ్ తో బీస్ట్, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. అయితే ఈ మూడు సినిమాలు కూడా భారీ డిజాస్టర్ కావడంతో ఈమె పరిస్థితి కాస్త తలకిందులు అయింది.

క్రేజీ ఆఫర్లను దక్కించుకున్నా.. అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టకపోవడంతో ఈమె క్రేజ్ క్రమంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాలో మాత్రమే నటిస్తోంది.కనీసం ఈ సినిమాతో నైనా తన కెరియర్ బాగుపడాలని ఆమె అభిమానులందరూ కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news