రామ్ గోపాల్ వర్మ కు వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్.. ఏమైందంటే..?

-

మెగాస్టార్ చిరంజీవి , తమన్నా జంటగా నటించిన చిత్రం భోళా శంకర్.. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తుండగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఈ నేపథ్యంలోని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళా వేదికలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైపర్ ఆది మాట్లాడుతూ.. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు యుద్ధభూమిలో సైనికుడిని అయి యుద్ధం చేస్తానని దిగి ఒకరోజు యుద్ధం చేసి గెలిచారు. 30 ఏళ్ల పాటూ యుద్ధ భూమిని ఏలారు. ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.. అన్నయ్య ఎంతోమంది సినీ సైనికులను తయారు చేసి ఇంద్రసేనాని అయితే.. తమ్ముడు ఏమో జనసైనికులను తయారుచేసి జనసేనాని అయ్యారు. మాట్లాడే వాడికి కూడా గూస్ బంప్స్ వచ్చేలా.. ఆయన మాట్లాడుతారు.. బేసిగ్గా హీరోలకి అభిమానులు ఉంటారు.. కానీ ఆయనకు హీరోలే అభిమానులుగా మారిపోతారు.

ఆస్తులు సంపాదించడం కంటే అభిమానులను సంపాదించడం మిన్న అనే ధోరణిలోనే చిరంజీవి నడుస్తారు. ప్రతి ఇంట్లో కూడా ఫ్యాన్ ఉంటుందో లేదో చెప్పలేము.. కానీ ప్రతి ఇంట్లో కూడా మెగాస్టార్ ఫ్యాన్ కచ్చితంగా ఉంటారు. ఇక టాలీవుడ్ లోనే ఒక డైరెక్టర్ ఉన్నాడు.. ఆయనను అనే స్థాయి నాకు లేదు.. అలాగని మెగాస్టార్ ను పవర్ స్టార్ ను అనే స్థాయి ఆయనకు లేదు.. చిన్న పెగ్ వేసినప్పుడు మెగాస్టార్ ను.. పెద్ద పెగ్ వేసిన పవర్ స్టార్ ను రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి చెబుతున్నాను అర్థం లేని మాటలకు క్లాప్స్ ఎలా అయితే రావో .. అర్థం లేని సినిమాలకు కలెక్షన్లు కూడా రావు.. నాకు తెలిసి మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా అన్ని బెడిసి కొడతాయి అంటూ ఇండైరెక్టుగా రాంగోపాల్ వర్మ కు కౌంటర్ ఇచ్చారు ఆది.. మరి దీనిపై వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news