ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్ కు సన్నాహాలు

-

‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ గుర్తిందిగా. ఆది సినిమాలోని ఈ డైలాగ్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. జూ.ఎన్టీఆర్ కథానాయకుడిగా.. వి.వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్‌ నిర్మాతగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తొడ కొట్టరా చిన్నా.. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా.. వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ అప్పట్లో ఓ ఊపు ఊపేశాయి.

‘ఆది’ విడుదలై 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోన్న ఈ తరుణంలో ఇప్పటికే పోకిరి, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు మరోసారి ట్రెండ్ సృష్టించాయి. ఈ తరుణంలో ఆది సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాత సురేశ్ రెడ్డి తెలిపారు.

’’గతేడాది కేవలం ఫ్యాన్స్‌ షో మాత్రమే వేశాం. కాకపోతే, ఈసారి ఎవరూ ఊహించని విధంగా భారీగా విడుదల చేయాలనుకుంటున్నాం. ‘చెన్నకేశవరెడ్డి’ రీ రిలీజ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని సురేశ్‌ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news