BREAKING : జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అనుమానస్పద మృతి

-

BREAKING : జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అనుమానస్పద మృతి చెందాడు. అంబేద్కర్ కోనసీమలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మేడిశెట్టి శ్యామ్ మణికంఠ రామ్ ప్రసాద్(21) అనుమానస్పద మృతి చెందాడు. కొత్తపేట(మ) మోడేకుర్రు శివారు కడలివారిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


పితానివారిపాలెంలో పెద్దమ్మ ఇంట్లో చేయి కోసుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మేడిశెట్టి శ్యామ్ మణికంఠ రామ్ ప్రసాద్.తిరుపతిలో హొటల్ మేనేజ్ మెంట్ చదివిన మణికంఠ…. స్వస్థలం కాట్రేనికోన మండలం కొప్పిగుంట అని సమాచారం. ఉపాధి కోసం మృతిని కుటుంబం తిరుపతి లో మకాం మార్చింది. ఇక ఈ సంఘటనపై పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news