సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయిన ‘కాలా’ నటి

-

సైబర్‌ నేరగాళ్ల చేతిలో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా మోసపోతున్నారు. ఇప్పటికే పలువురు నటులు వీరి బారిన పడ్డారు. తాజాగా మరో హీరోయిన్ ఈ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ‘కాలా’ ఫేమ్‌ అంజలి పాటిల్‌ నుంచి సైబర్ కేటుగాళ్లు భారీ మొత్తంలో డబ్బు కాజేశాసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

కొన్నిరోజుల క్రితం దీపక్‌ శర్మ అనే వ్యక్తి అంజలికి కాల్ చేసి ప్రముఖ కొరియర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. తైవాన్‌కు వెళ్తున్న పార్శిల్‌లో డ్రగ్స్‌ దొరికాయని దానిపై ఆమె ఆధార్‌ కార్డు వివరాలు ఉన్నాయని చెప్పాడు. అంతటితో ఆగకుండా కస్టమ్స్‌ అధికారులు దానిని సీజ్‌ చేశారని ముంబయి సైబర్‌ పోలీసులను కలవాలని చెప్పడంతో ఆమె షాక్ అయింది.

ఆ షాక్లో నుంచి తేరుకునేలోపే బెనర్జీ అనే మరో వ్యక్తి అంజలికి ఫోన్‌ చేసి తాను ముంబయి సైబర్‌ పోలీసునని పరిచయం చేసుకుని పలు కారణాలు చెప్పి ఆమె నుంచి దాదాపు రూ.5.79 లక్షలు కాజేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అతడు స్పందించకపోవడంతో అంజలి డీఎన్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news