క‌మ్మ‌రాజ్యంలో టైటిల్ మారింది.. కొత్త టైటిల్ ఇదే

-

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తాజా చిత్రం క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు. కొద్ది రోజులుగా ఈ సినిమాపై అటు సోష‌ల్ మీడియా, మీడియా స‌ర్కిల్స్‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. ఇక టీజ‌ర్లు, ట్రైల‌ర్లు వ‌చ్చాక ఎవ‌రు ఒప్పుకున్నా.. ఒప్పుకోక‌పోయినా ఇది ఖ‌చ్చితంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ను టార్గెట్‌గా చేసుకునే తీసిన సినిమా అన్న టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది.

ఇక వ‌ర్మ త‌న తాజా ప్రెస్‌మీట్లో కూడా ఈ సినిమాను రాష్ట్రంలో పాపుల‌ర్ అయిన ఓ తండ్రి కొడుకుల‌కు అంకితం ఇస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఇక సెన్సార్ కూడా కంప్లీట్ కాలేదు. కొంద‌రు టైటిల్ మార్చాల‌ని కేసులు వేశారు.

సినిమా రిలీజ్‌కు ఒక్క రోజు మాత్ర‌మే టైం ఉండ‌డంతో వెన‌క్కు త‌గ్గిన వ‌ర్మ సినిమా టైటిల్ మార్చారు. ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చారు. దీంతో ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు లేకుండా అయిపొయింది. మ‌రి అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు ఎప్ప‌ట‌కీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని… ఎప్ప‌ట‌కి రిలీజ్ అవుతుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news