సుశాంత్ కేసులో బిగ్ ఫిష్ ఎవరు…?

-

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య వ్యవహారంపై బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ముంబై పోలీసులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆమె తరుచుగా వారి టార్గెట్ గానే విమర్శలు సంధిస్తున్నారు. ముంబై పోలీసులతో పాటుగా అక్కడి ప్రభుత్వం, సుశాంత్ కి పోస్ట్ మార్టం నిర్వహించిన కూపర్ ఆస్పత్రిపై కూడా ఆరోపణలు చేస్తున్నారు.

ఇప్పుడు కంగనా కాసేపటి క్రితం మరో ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ లో… కేసుని త్వరగా ముగించాలని ఆదేశాలు ఇస్తున్న బిగ్ ఫిష్ ని వెంటనే సిబిఐ పట్టుకోవాలని ఆమె సూచన చేసారు. ఆమె ట్వీట్ తో బిగ్ ఫిష్ ఎవరు అంటూ కింద కొందరు రీ ట్వీట్ లు చేస్తున్నారు. ఈ కేసులో సిద్దార్థ్ పితాని తో పాటుగా సందీప్ సింగ్ ని సిబిఐ విచారణకు పిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news