మీరు డ్రగ్స్ పరిక్షలకు రెడీనా…? హీరోయిన్ సంచలనం…!

-

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం నుంచి కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్ హీరోలకు ఆమె ఒక సవాల్ విసిరారు. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశిక్ వంటి వారు… ‘కొకైన్ బానిసలు’ అనే ‘పుకారు’ను ఛేదించడానికి డ్రగ్స్ పరిక్షల కోసం గానూ తమ రక్త నమూనాలను ఇవ్వమని ఆమె పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. రియా చక్రవర్తికి డ్రగ్స్ గ్యాంగ్ లతో లింకులు ఉన్నాయని, ఆమెనే సుశాంత్ సింగ్ కి డ్రగ్స్ అలవాటు చేసిందని సుశాంత్ ఫ్యామిలీ అంటోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ యువ హీరోలకు డ్రగ్స్ అలవాటు ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన కంగనా పై విధంగా వారికి స్వీట్ సవాల్ విసిరింది.

Read more RELATED
Recommended to you

Latest news