బ్రేకింగ్: వైసీపీ సీనియర్ నేతకు ఎమ్మెల్యే కొడుకు వార్నింగ్

-

చీరాలలో మరో సారి కరణం, ఆమంచి వర్గ పోరు బయటపడింది. వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, నాయకులు, కార్యకర్తలు. ఆమంచికి ఇన్ డైరెక్టుగా కరణం వెంకటేష్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేత కరణం వెంకటేష్ మాట్లాడుతూ… చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని ఆరోజు ప్రమాణం చేశామన్నారు. చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చేందుకే మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

గతంలో మాదిరిగా ఇక్కడ అరాచకాలు, బెదిరింపులు సాగవన్నారు. బెదిరింపులను ఎవరూ చూస్తూ కుర్చోరు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వైసీపీలో చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే అందరం కలసి వైసీపీ లోకి వచ్చామని చెప్పారు. బాలినేని శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి చీరాలను అభివృద్ది చేసుకుందామని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news