కీర్తి సురేష్ ఇచ్చిన క్లారిటీ అదిరిపోయిందిగా ..!

-

తెలుగులో చేసింది కొన్ని సినిమాలైనా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది కీర్తి సురేష్. నేను శైలజ తో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ మహానటి, అజ్ఞాతవాసి సినిమాలలో నటించింది. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి గొప్ప పేరుని సంపాదించుకుంది. కేవలం అందం,అభినయం తోనే కాకుండా అద్భుతమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

 

ఇప్పటి వరకు చేసిన సినిమాలలో కాస్త కూడా గ్లామర్ గా గాని లిమిటేషన్స్ దాటి ఎక్స్‌ఫోజింగ్ చేయడం గాని చేయలేదు. హుందాతనంతో చాలా సెలెక్టివ్ గా సినిమాలని ఎంచుకొని టాలీవుడ్ లో సౌందర్య లాగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా మంచి కథా బలమున్నవి కావడం విశేషం.

అయితే ఈ మద్య కీర్తి సురేష్ కాస్త బరువు తగ్గడం తో కొత్త గా కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. మహానటి సమయంలో కాస్త బొద్దుగా ఉన్న కీర్తి ఇప్పుడు నాజూకుగా తయారైంది. అయితే ఓ మీడియా ఏజెన్సీ వారు కీర్తి ఎక్స్ పోజింగ్ చేయడానికి సిద్దమయ్యో ఇలా కీర్తి సురేష్ సన్నబడిందని ఇప్పటి నుంచి గ్లామర్ పాత్రలు చేయబోతుందంటూ రక రకాలుగా న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇది చూసిన కీర్తి ఇటీవలే ఒక ఇంటర్వ్యూ ద్వారా కాస్త ఘాటుగానే స్పందించింది. తనపై వచ్చిన ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని నిర్మిహమాటంగా తేల్చి చెప్పింది. తాను బరువు తగ్గింది సినిమాలలో నాజూగ్గా కనిపించడానికి తప్ప ఎలాంటి ఎక్స్ పోజింగ్ రోల్స్ నటించడానికి కాదని స్పష్ఠం చేశింది.

Read more RELATED
Recommended to you

Latest news