బయోపిక్స్ తో కీర్తి సురేష్ ని పాపులర్ చేస్తున్నారా …?

-

టాలీవుడ్ లో కీర్తి సురేష్ కి మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత నేను లోకల్ సినిమా కూడా మంచి సక్సస్ ని అందుకుంది. దీంతో కీర్తి సురేష్ ఏకంగా భారీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

 

keerthi suresh Biography, Wiki, DOB, Family, Profile, Movies list

అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. భారీ డిజాస్టర్ గా మిగిలింది. కాని ఈ సినిమా తర్వాత వచ్చిన మహానటి సినిమా మాత్రం కీర్తి సురేష్ కి జీవితంలో ఎప్పటికి మిగిలిపోయో తీపి గుర్తును ఇచ్చింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అవార్డులు రివార్డులను సాధించింది. అయితే ఆ తర్వాత మాత్రం ఎందుకనో తెలుగు సినిమాలలో కీర్తి సురేష్ కి అవకాశాలు రాలేదు. నాగార్జున నటించిన మన్మధుడు 2 లో చిన్న పాత్ర చేసింది.

అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలో నటిస్తుంది. అంతేకాదు నితిన్ తోనే మరో సినిమాను చేయనుందని సమాచారం. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోయో సినిమాలో కూడా కీర్తి సురేష్ ని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే కీర్తి సురేష్ మరో బయోపిక్ లో నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. కృష్ణ సతీమణి దర్శకురాలు, నటి విజయ నిర్మల బయోపిక్ లో నటించబోతుందన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే అది వాస్తవం కాదని సమాచారం. దీన్ని బట్టి చూస్తే అనవసరంగా బయోపిక్స్ అంటూ కీర్తి సురేష్ ని హైలెట్ చేస్తున్నారంతే.

Read more RELATED
Recommended to you

Latest news