మెగా అల్లుడి మూవీ డైరెక్ట్‌గా OTT లోనే స్ట్రీమింగ్..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..అల్లుడు కల్యాణ్ దేవ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి చిత్రం ‘విజేత’తో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పొందిన ఆ తర్వాత..సినిమాలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. కల్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’ పిక్చర్ విడుదలైన సంగతే ఎవరికీ తెలియలేదు. ఈ క్రమంలోనే ఆయన నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కిన్నెరసాని’పై ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడు.

ఈ సినిమా ద్వారా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని కల్యాణ్ దేవ్ భావిస్తున్నారని సమాచారం. ‘కిన్నెరసాని’ అనే ఫిల్మ్ టైటిల్‌యే విభిన్నంగా ఉండగా, ఎట్టి పరిస్థితులలో ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, కుదరలేదు. దాంతో ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ Zee5లో చిత్రాన్ని స్ట్రీమ్ చేయనున్నారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ర‌మ‌ణ‌తేజ డైరెక్టర్. హీరో కల్యాణ్ దేవ్ కు జోడీగా అన్‌శీత‌ల్, కాశీష్‌ఖాన్ హీరోయిన్స్ గా న‌టించారు. మ‌హ‌తి స్వర సాగర్ మ్యూజిక్ అందించగా, ఎస్ఆర్‌టి ఎంటర్ టైన్మెంట్స్‌, శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్ తాళ్లూరి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news