అఫీషియల్ : చరణ్ కి మరోసారి జోడీగా కియారా..!

-

ఇండియాలోనే శంకర్ టాప్‌ డైరెక్టర్‌. ఆయన సినిమాలలో యాక్షన్‌ తో పాటు సందేశం కూడా ఉంటుంది. శంకర్‌ ఇప్పుడు తెలుగు లో రాం చరణ్‌ తో కలిసి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా సినిమాగా శంకర్‌ తెరకెక్కిస్తున్నాడు. దిల్‌ రాజ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా… థమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా చేస్తున్నారు.

ఇక దిల్‌ రాజ్‌ కు ఈ సినిమా 50 వ సినిమా కావడం గమనార్హం. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం మొదట సౌత్‌ కొరియన్‌ నటి సుజీ బేను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. తర్వాత కియారా అద్వానీ, అలియా భట్‌ లతో సహ పలువురి పేర్లు వినిపించినా.. హీరోయిన్‌ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే… తాజాగా ఈ సినిమా హీరోయిన్‌ ను దర్శకుడు శంకర్‌ అఫిషీయల్‌ గా ప్రకటించేశాడు. కియారా అద్వానీ పుట్టిన రోజు నేపథ్యంలో…ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారంటూ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news