ఓటీటీలోకి వచ్చేసిన నిత్యామీనన్ ‘కుమారి శ్రీమతి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

సినిమాలు చేయడంలో మలయాళ కుట్టి నిత్యామీనన్ రూటే సపరేటు. ఈ బ్యూటీ కంటెంట్ ఉన్న సినిమాలకే సై ఉంటుంది. కథ ఇంట్రెస్టింగ్​గా ఉంటేనే ఆ సినిమాకు సైన్ చేస్తుంది. ఇన్నాళ్లు వెండితెరపై సందడి చేసిన నిత్యా.. ఇప్పుడు డిజిటల్ మీడియాలోనూ దూసుకెళ్తోంది. తాజాగా నిత్యా మీనన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘కుమారి శ్రీమతి’. గోమఠేష్‌ ఉపాధ్యాయ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ్టి నుంచి ఏడు ఎపిసోడ్లలో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.

ఈ సిరీస్​లో గౌతమి, తిరువీర్‌, నిరుపమ్‌, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీమోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వప్నా సినిమాస్‌ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో నిత్యామేనన్‌ గ్రామీణ యువతిగా కనిపించనుంది. పెళ్లంటే ఇష్టపడని.. స్వయంశక్తితో ఎదగాలనుకునే గడసరి యువతిగా ఆమె పాత్ర ఉంది. తాతల నాటి ఇంటిని తిరిగి దక్కించుకునేందుకు ఇటికెల పూడి శ్రీమతి (నిత్యామేనన్‌) బార్‌ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? మరి ఇంటిని దక్కించుకుని, పెళ్లి చేసుకుందా? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

Read more RELATED
Recommended to you

Latest news