లెట్స్ ట్రోల్ : వివాదంలో రాశీ ఖ‌న్నా !

-

మాట జాగ్ర‌త్త రాశీ ఖ‌న్నా
ఇక్క‌డ మీకు న‌ట‌న ప‌రంగా
వ‌చ్చిన మార్కులేవీ లేవు
జ‌స్ట్ మీది స్కిన్ షోనే
కానీ మీరు ఆ రోజు ఎందుక‌ని
గ్లామ‌ర్ షోకు ఒప్పుకున్నారు
ఇప్పుడెందుకు అని మా ఇండ‌స్ట్రీని తిడుతున్నారు
అని అంటూ … నెటిజ‌న్లు అందాల రాశీ తీరుపై
ఫైర్ అవుతున్నారు.

తెలుగు చిత్ర సీమ‌ను ఉద్దేశించి ఇటీవ‌ల కాలంలో కొన్ని వివాదాలు రేగుతున్నాయి. తెలుగేత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన హీరోయిన్లు ఇక్క‌డ న‌టించి, ఆశించిన స్థాయి క‌న్నా ఎక్కువ సౌక‌ర్యాలు అందుకుని, రెమ్యున‌రేషన్లు తీసుకుని విల్లాలు కొనుగోలు చేసి మ‌రీ! ఇక్క‌డే స్థిర‌ప‌డిపోయినా కూడా ఈ ప్రాంతం అంటే వారికి చిన్న చూపే ! అయితే మూవీ మేక‌ర్స్  కూడా అలానే ఉన్నారు.

సౌత్ లో న‌టించాలంటే ముఖ్యంగా తెలుగు నాట న‌టించాలంటే ఎక్స్ పోజింగ్ చేస్తే చాలు అన్న భావ‌న వ‌చ్చే విధంగానే హీరోయిన్ల పాత్ర‌ల‌ను తీర్చిదిద్దుతున్నారు. కానీ వారికి న‌ట‌నకు ప్రాధాన్యం అన్న‌ది అస్స‌లు ఇవ్వ‌డం లేదు.  దీంతో అప్పుడు తాప్సీ కూడా ఇలానే గొడ‌వ చేసింది. త‌రువాత స‌ర్దుకుంది. రాఘ‌వేంద్రరావును ఉద్దేశించి కామెంట్లు చేసి త‌రువాత డిలీట్ ఆప్ష‌న్ ను ఎంచుకుని
సోష‌ల్ మీడియాలో త‌న‌దైన తెలివి ఒక‌టి ప్ర‌ద‌ర్శించింది. బ‌య‌ట‌కు చెప్ప‌క పోయినా కంగ‌నాను కూడా టాలీవుడ్ పెద్ద‌గా గుర్తింపు ఉన్న పాత్ర‌ల్లో చూపించ‌లేదు. పూజా హెగ్డే (బెంగ‌ళూరు భామ‌) కూడా ఇదేవిధంగా చాలా అస‌భ్య‌క‌ర రీతిలో కామెంట్లు చేసింది.
ఇప్పుడిదే కోవ‌లో రాశిఖ‌న్నా కూడా టీ టౌన్ పై కామెంట్లు చేసింది.ఇటీవ‌లే బాలీవుడ్ కు వెళ్లిన రాశీఖ‌న్నా సౌత్ సినిమాల్లో రెండు పాట‌లు, కొన్ని స‌న్నివేశాలకు త‌ప్ప అక్క‌డ న‌టించేందుకు అస్స‌లు స్కోప్ ఉండ‌ద‌ని వ్యాఖ్య‌లు చేసింది.దీంతో ఈమె మాట‌ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఆమె తన వ్యాఖ్య‌ల‌ను వెంట‌నే విత్ డ్రా చేసుకోవాల‌ని కూడా ప‌ట్టుబ‌డుతున్నారు. గ్లామ‌ర్ కోస‌మే హీరోయిన్ల‌ను తీసుకుంటార‌ని తెలిసి కూడా ఎందుక‌ని ఇక్క‌డి సినిమాలు ఒప్పుకుంటున్నార‌ని, అంటే మీరంతా డ‌బ్బుకోస‌మే క‌దా! తెలుగు చిత్ర సీమ‌లో అడుగు పెడుతున్న‌ది, మీ అంగీకారం లేకుండానే గ్లామ‌ర్ షో చేయిస్తున్నారా అని మండిప‌డుతున్నారు
నెటిజ‌న్లు.

Read more RELATED
Recommended to you

Latest news