డైరెక్టర్ క్రిష్ పాత్ర పై మాదాపూర్ డీసీపీ కీలక వ్యాఖ్యలు

-

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఎఖర్లో గచ్చిబౌలి పోలీసులు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. డ్రగ్స్ పారీ జరిగే సమయంలో రాడిసన్ హోటల్లో డెరెక్టర్ క్రిష్ ఉన్నటు పోలీసులు అనుమానించారు. మంగళవారం సాయంత్రం ఈ డ్రగ్స్ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ సమావేశంలో వెలడించారు. రాడిసన్ హోటల్ కేసును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిందితుల బడ్ శాంపిల్స్ ని టెస్ట్ చేయగా.. డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటు తెలిపారు. రాడిసన్ హోటల్లో అనేక పార్టీలు చేసుకున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.

డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారో లేదో ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. వివేకానంద క్రిష్ కి ఎన్నాళ్ల నుంచి పరిచయం ఉందో తెలియాల్సి ఉందని అన్నారు. నిందితులు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనూహ్యంగా ఈ కేసులో క్రిష్ పేరు తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news