`పుష్ప‌` కోసం మ‌రో హీరోని ప‌ట్టేశాడు`

-

బ‌న్నీ న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. `రంగ‌స్థ‌లం` వంటి రివేంజ్ డ్రామా త‌రువాత అదే ఫార్ములాతో ఈ చిత్రాన్ని కూడా తెర‌పైకి తీసుకొస్తున్నారు. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఈ ఏడాది ప్రారంభంలో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న బ‌న్నీ అ వెంట‌నే `పుష్ప‌` చేస్తుండ‌టం, గ‌త చిత్ఆర‌ల‌కు పూర్తి భిన్నంగా ఊర‌మాస్ పాత్ర‌లో బ‌న్నీ క‌నిపిస్తుండ‌టంతో ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా అంచ‌నాలు నెల‌కొన్నాయి.


ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగ‌నుంది. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పిక్స్ సినిమాపై అంచ‌నాల్ని స్కై హైకి చేర్చింది. అందుకు అనుగునంగానే చిత్ర బృందం ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇందులోని కీల‌క పాత్ర కోసం త‌మిళ హీరో మాధ‌వ‌న్‌ని చిత్ర బృందం ఎంపిక చేసింది. ముందు ఈ పాత్ర‌ని విజ‌య్ సేతుప‌తి చేత చేయించాల‌నుకున్నారు కానీ ఆయ‌న త‌ప్పుకోవ‌డంతో ఎవ‌రిని ఎంపిక చేయాలా అని చాలా మందిని ప‌రిశీలించి సుక్కు చివ‌రికి మాధ‌వ‌న్‌ని ఎంపిక చేసినట్టు తెలిసింది. న‌వంబ‌ర్ 20 నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.

Read more RELATED
Recommended to you

Latest news