మహర్షి ఇంటర్వల్ అదిరిపోద్దట..!

-

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ మహర్షి. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ ప్రెస్టిజియస్ మూవీని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది.

సినిమాలో మహేష్ ఒకటే పాత్ర విభిన్న రూపాల్లో కనిపిస్తాడట. టైం ట్రావల్ గా హీరో క్యారక్టరైజేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుందట. ముఖ్యంగా సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ అదిరిపోయిందని అంటున్నారు. ఇంటర్వల్ వరకే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. ఊపిరి తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5 తెలుగు సంవత్సరాది కానుకగా రిలీజ్ చేస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ కూడా మొదలైందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news