నేడు మోదీతో తెరాస అధినేత భేటీ…

-

తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత తొలిసారి మర్యాద పూర్వకంగా సాయంత్రం 4 గంటలకు మోదీని కలవనున్నారు. దేశవ్యాప్తంగా నాన్ కాంగ్రెస్ – నాన్ బీజేపీ దిశగా  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు దక్కాల్సిన వాటాలు, హక్కులపై , పరిష్కారం కాని విభజన సమస్యలపై ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. ఇందులో భాగంగా.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ట్రిపుల్ ఐటీ తదితర అంశాలపై మోదీకి వినతిపత్రం అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినందును కాళేశ్వరానికి కూడా ఇవ్వాలని తెరాస ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కేంద్ర నుంచి రావాల్సిన  వాటాను సైతం ప్రస్తావించనున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖను ఎన్నిసార్లు కోరినా స్పందన కరువైంది.  మోదీతో భేటీ అనంతరం కేసీఆర్ పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news