ఆడియన్స్ ‘మైండ్ బ్లాక్’ చేస్తూ దూసుకెళ్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మాస్ సాంగ్….!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కొన్నేళ్ల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. మంచి కమర్షియల్, మాస్ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి అఫీషియల్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు కూడా ఏర్పరచడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా నుండి మైండ్ బ్లాక్ అనే పల్లవితో సాగె మాస్ సాంగ్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అదరగొట్టే మాస్ బీట్ తో యూత్ మరియు మాస ని షేక్ చేసేలా దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసాడు. బ్లెజ్ మరియు రనిన రెడ్డి కలిసి పాడిన ఈ సాంగ్ కి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు.

 

ఇక ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో పలు రికార్డ్స్ నమోదు చేస్తూ ధూమోసుకెళ్తోంది. థియేటర్స్ లో ఈ సాంగ్ కు ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయం అని అర్ధం అవుతోంది. ఇక చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాను జనవరి 11న రిలీజ్ చేయనున్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, హరితేజ, బండ్ల గణేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తున్నారు. మరి ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా రెండు విజయాలు అందుకున్న సూపర్ స్టార్, ఈ సినిమాతో ఎంతవరకు హ్యాట్రిక్ అద్నడుకుంటారో చూడాలి…!!

Read more RELATED
Recommended to you

Latest news