హిమాలయాలకు మహేష్ బాబు.. అందుకోసమే అంటూ టాక్

-

హిమాలయాలకు మహేష్ బాబు ఏంటి.. వినడానికి విడ్డూరంగా ఉంది. ఆయనకేం కష్టమొచ్చింది? ఏం ఖర్మ అని అనుకుంటున్నారా? రజినీకాంత్ లాంటి హీరో వెళ్తున్నాడంటే అందులో ఆశ్చర్యం కలిగించదు కానీ మహేష్ బాబు వెళ్తున్నాడంటే మాత్రం అందరిలోనూ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. అసలింతకీ ఈ కథేంటో ఓ సారి చూద్దాం.

మహేష్ బాబు  మామూలుగా అయితే హాలీడే ఎంజాయ్ చేయాలంటే న్యూయార్క్, దుబాయ్ వంటి అత్యంత విలాసవంతమైన నగరాలకు పయనమవుతాడు. కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని మహేష్ ఎంజాయ్ చేసే హాలీడే స్పాట్‌లు చాలానే ఉన్నాయి. గత రెండు నెలలుగా మహేష్ ఇదే పని చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు విజయం సాధించిన తరువాత.. మహేష్ ఫ్యామిలీని తీసుకుని విదేశాలను చెక్కేశాడు.

తాాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబు హిమాలయాలకు పయణమవుతున్నాడు. అయితే ఇది ఆధ్యాత్మికమైనది, లేదా వైద్యం గురించా? అన్నది క్లారిటీగా తెలియడం లేదు. కొందరేమో మానసిక ప్రశాంతత గురించి అంటుంటే.. మరికొందరు ఆయన మోకాలి శస్త్ర చికిత్స కోసమేనని అంటున్నారు. అయితే ఈ ట్రిప్‌లో మహేష్ బాబు ఫ్యామిలీ ఉంటుందా? లేదా అన్నది కూడా తెలియడం లేదు.

మహేష్ ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించనున్నాడని టాక్ నడుస్తోంది. వంశీ పైడిపల్లి కథను రిజెక్ట్ చేశాక పరుశురామ్, ఇంద్రగంటి మోమనకృష్ణ వంటి వారిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఏది ఇంకా కన్ఫామ్ కాలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news