తెర వెనుక భారీ స్కెచ్ వేస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. అసలు ఏమైందంటే..?

-

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు అటు హీరో గానే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఎంతో మంది అభిమానులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇతరులకు సహాయం చేయడంలో ఎంత హుందాగా అయితే ఉంటాడో తన ఫ్యాన్స్ కూడా అంతే హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు..సినిమా నచ్చితే జై కొడతారు లేదంటే సైలెంట్ గా ఉండిపోతారు. మహేష్ బాబు కూడా ఈ విషయాన్ని మీడియాతో ప్రస్తావించడం జరిగింది.

మహేష్ బాబు మాట్లాడుతూ.. నా అభిమానులు ఎంతో నిజాయితీగా ఉంటారు.. సినిమా నచ్చితేనే చూస్తారు లేదంటే నా ఫాన్సే నా సినిమా చూడరు. అంటూ చెప్పుకొచ్చారు .. ఇకపోతే గత కొంతకాలంగా మహేష్ అభిమానుల పంథా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కడు, పోకిరి వంటి సినిమాలకు తాజాగా స్పెషల్ షో లు వేయడం, సోషల్ మీడియాలో ఫాన్స్ యాక్టివా అవడం అన్ని చూస్తూనే ఉన్నాం .దీని వెనుక మహేష్ బాబు అభిమానులు భారీ స్కెచ్ వేస్తున్నారని సమాచారం ఉంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా అయిపోయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తానని ప్రకటించారు.. అంటే త్రివిక్రమ్ సినిమా తర్వాత మళ్లీ రెండు సంవత్సరాల పాటు మహేష్ బాబు సినిమా వచ్చే అవకాశం లేదు. ఇక ఈ గ్యాప్ లో అభిమానులలో మూడ్ చేంజ్ కాకుండా ఇప్పటినుంచి వారిని ఆక్టివ్ గా ఉంచడానికి ఇండస్ట్రీలోనూ మహేష్ పేరు మ్రోగేందుకు ఫ్యాన్స్ భారీ స్కెచ్ ప్లాన్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు ఓ రేంజ్ లో స్పెషల్ షో లు చేస్తూ బాగా మహేష్ బాబును వైరల్ చేస్తున్నారు. అంతేకాదు పాత సినిమాల పోస్టర్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనను మరింత పాపులర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news