మహేష్ భారీ ప్రాజెక్ట్…!

-

టాలీవుడ్ లో మహేష్ బాబు ఇప్పుడు దూకుడుగా వెళ్ళే ఆలోచన చేస్తున్నాడు. వరుసగా సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు రెండు మూడు ఏళ్ళుగా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా కథ నచ్చితే ఓకే చెయ్యడం లేకపోతే ఎంత పెద్ద దర్శకుడు అయినా సరే పక్కన పెట్టేస్తున్నాడు. ఇక అతని సినిమాలకు ఈ మధ్య ఆదరణ కూడా తగ్గింది.

దీనితో మహేష్ బాబు ఇప్పుడు కథల ఎంపికలో దూకుడుగా జాగ్రత్తగా వెళ్తూనే వరుసగా సినిమాలను చేసే ఆలోచనలో ఉన్నాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. మహేష్ బాబు ఈ మధ్య కాలంలో ఏ సినిమాను ఎంపిక చెయ్యాలో ఇబ్బంది పడుతున్నాడు. వంశీ పైడపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యాలి అనుకున్నా సరే ఆ సినిమా విషయంలో ఏ స్పష్టత లేకపోవడం తో మహేష్ ఆలోచనలో పడ్డాడు.

ఇప్పుడు అతను ఒక భారీ ప్రాజెక్ట్ ని ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఒకరు మంచి కథ తీసుకు రాగా దానికి 200 కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని చెప్పగా తాను ఎక్కువగా పెట్టుబడి పెడతా అని మహేష్ నిర్మాతతో చెప్పాడట. ఇద్దరూ కలిసి చెరో వంద కోట్లు పెట్టాలని భావిస్తున్నారు. అయితే దర్శకుడు ఎవరు అనేది తెలియకపోయినా ఈ కథ మాత్రం మహేష్ కి బాగా నచ్చింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

Read more RELATED
Recommended to you

Latest news