మహేష్ ప్రొడక్షన్ లో యంగ్ హీరో

-

సూపర్ స్టార్ మహేష్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా మారబోతున్నాడు. ఎం.బి ప్రొడక్షన్స్ లో త్వరలో ఓ వెబ్ సీరీస్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్న మహేష్ దానితో పాటుగా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకీ మహేష్ ప్రొడక్షన్ లో హీరోగా ఎవరు చేస్తున్నారు అంటే గూఢచారిగా హిట్ అందుకున్న అడివి శేష్ అని తెలుస్తుంది. గూఢచారి డైరక్టర్ శషికిరణ్ డైరక్షన్ లోనే అడివి శేష్ హీరోగా ఈ సినిమా వస్తుందట.

ఇప్పటికే కథ ఫైనల్ అవగా ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ బాధ్యతలను నమ్రత శిరోత్కర్ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వెబ్ సీరీస్ విషయానికొస్తే చార్లి అనే టైటిల్ తో ఈ వెబ్ సీరీస్ వస్తుందట. మీకు మీరే మాకు మేమే డైరక్టర్ హుస్సెన్ షా కిరణ్ ఈ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఓ పక్క వెబ్ సీరీస్ మరో పక్క సినిమా ఇలా మహేష్ పూర్తిస్థాయిలో నిర్మాతగా మారడం పరిశ్రమకు మంచిదే. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news