ప్రియుడితో అక్ర‌మ సంబంధం పెట్టుకుని.. భ‌ర్త‌నే హ‌త్య చేయించింది ఆ మ‌హిళ‌..!

-

నేటి త‌రుణంలో కొంద‌రు స్త్రీలు ఇత‌ర‌ పురుషుల‌తో వివాహేత‌ర సంబంధాలు పెట్టుకుని భ‌ర్త‌ల‌నే హత్య చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. తాజాగా ఓ మ‌హిళ త‌న ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త్య చేసింది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ లోని బోయిన్ ప‌ల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

హైద‌రాబాద్ లోని బోయిన్‌ప‌ల్లిలో బాబా ఖాన్ అనే వ్య‌క్తి త‌న భార్య జ‌హీదాతో క‌ల‌సి జీవిస్తున్నాడు. అయితే జ‌హీదా గ‌త కొంత కాలంగా వేరే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌న బంధానికి భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌నే కార‌ణంతో తన ప్రియుడితో క‌లిసి జ‌హీదా భ‌ర్త‌ను హత్య చేయించించింది. బాబా ఖాన్ త‌న ఇంట్లో నిద్రిస్తున్న స‌మ‌యంలో జ‌హీదా ప్రియుడు త‌న స్నేహితుల‌తో క‌ల‌సి వచ్చి బాబా ఖాన్‌ను గొంతు నులిమి చంపేశారు. రాత్రి 1 గంట దాటాక వారు ఈ హ‌త్య చేశార‌ని పోలీసులు తెలిపారు. అయితే భ‌ర్త‌ను హ‌త్య చేయించాక భార్య జ‌హీదా దాన్ని స‌హ‌జ మ‌ర‌ణంగా చిత్రీక‌రించేందుకు య‌త్నించింది. ఈ క్ర‌మంలో బంధువులు అది న‌మ్మారు. దీంతో ఆమె భ‌ర్త అంత్య‌క్రియలు కూడా పూర్తి చేసింది.

అయితే ఇరుగు పొరుగున ఉన్న‌వారు ఇచ్చిన స‌మాచారం మేర‌కు జ‌హీదా ప్ర‌వ‌ర్త‌న‌పై త‌మకు అనుమానం ఉంద‌ని చెప్పి బాబాఖాన్ బంధువులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు బాబాఖాన్ మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీసి పోస్టు మార్టం నిర్వ‌హించారు. దీంతో అత‌న్ని గొంతు నులిమి హ‌త్య చేసిన‌ట్లు పోస్టు మార్టం నివేదిక‌లో తెలిసింది. ఈ క్ర‌మంలో పోలీసులు జ‌హీదాను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టింది. భ‌ర్త‌ను తానే త‌న ప్రియుడితో క‌లిసి హ‌త్య చేయించిన‌ట్లు ఆమె ఒప్పుకొంది. దీంతో జ‌హీదాతోపాటు ఆమె ప్రియుడు, అత‌నికి స‌హ‌క‌రించిన అత‌ని స్నేహితులు మ‌రో ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది..!

Read more RELATED
Recommended to you

Latest news