Mahesh Babu : ఆ ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేస్తానంటున్న మహేశ్ బాబు..

-

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం సాధించిన సంగతి అందరికీ విదితమే. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించిన సినిమాలు 1970, 80ల్లో వచ్చాయి. ఆ తర్వాత ఆ తరహా చిత్రాలు రాలేదు. కాగా, రాజమౌళి వలన ఆ కాంబినేషన్ పాజిబుల్ అయింది. ఈ క్రమంలోనే మల్టీస్టారర్ ట్రెండ్ షురూ అయిందని చెప్పొచ్చు.

క్రేజీ మల్టీస్టారర్ మూవీస్ భవిష్యత్తులో వచ్చే చాన్సె్స్ ఉన్నాయి. తాను ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరితోనైనా, అవసరమైతే ఇద్దరితోనూ మల్టీస్టారర్ మూవీ చేస్తానని మహేశ్ ఇటీవల ఓ ప్రైవేటు ఫంక్షన్ లో చెప్పారు. ఆ విషయం తెలుసుకుని సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

rrr mahesh

మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ షురూ అయితే చాలా బాగుంటుందని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా దర్శకుడు సరిపోయే స్టోరిని రచిస్తే కనుక మహేశ్ – రామ్ చరణ్ లేదా మహేశ్ – తారక్ కాంబోను సిల్వర్ స్క్రీన్ పైన ప్రేక్షకులు చూసే అవకాశాలుంటాయి.

మరో వైపున అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రవితేజ – బాలయ్య హీరోలుగా సినిమా ఉండబోతుందని వార్తలొస్తున్నాయి. ఈ మల్టీస్టారర్ మూవీ కోసం అనిల్ రావిపూడి ఆల్రెడీ స్టోరి రచించారట. చూడాలి మరి.. ఈ వార్తల్లో నిజమెంతుందో..తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం వచ్చే నెల 12న విడుదల కానుంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇందులో మహేశ్ సరసన అందాల ముద్దుగుమ్మ ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించింది. ఎస్.ఎస్.థమన్ ఈ మూవీకి సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news