మహేష్ మనసు గెలిచిన గీతా గోవిందం

-

నిన్న రిలీజ్ అయిన గీతా గోవిందం సినిమా సిని ప్రముఖులను అలరిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన రాజమౌళి తన రెస్పాన్స్ తెలియచేయగా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ కూడా గీతా గోవిందం మీద తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. సినిమా చూసిన మహేష్ చాలా ఎంజాయ్ చేశానని గీతా గోవిందం ఓ విన్నర్ గా అభిప్రాయపడ్డాడు. విజయ్, రష్మిక అద్భుతంగా నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిశోర్ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన వ్యక్తులని టీం మొత్తానికి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశాడు.

మహేష్ గీతా గోవిందం పై ఇలా ట్వీట్ చేయడం సినిమాకు మరింత బూస్టింగ్ ఇస్తుంది. సినిమా కథ రొటీన్ గా అనిపించినా స్క్రీన్ ప్లే మాత్రం చాలా సరదాగా నడిపించాడు. మొదటి రోజే ఈ సినిమా 9 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. చూస్తుంటే విజయ్ దేవరకొండ మరోసారి బాక్సాఫీస్ పై తన సత్తా ఏంటో చూపించేలా వసూళ్లు రాబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news