రాజమౌళి ట్రిపుల్ ఆర్ లో మహేష్..?

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాపై రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా మొదట 150 కోట్ల బడ్జెట్ అనుకోగా ఇప్పుడు 300 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా రాబోతుంది.

రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కూడా భాగమవుతున్నాడట. ఏంటి కొంపదీసి మహేష్ కూడా ఈ సినిమాలో నటిస్తాడా అంటే ఆ అవకాశం లేదు కాని మహేష్ వాయిస్ ఓవర్ మాత్రం వాడేస్తారట. ట్రిపుల్ ఆర్ లో మహేష్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.

అక్టోబర్ నుండి మొదలవనున్న ఈ సినిమా 2020లో రిలీజ్ చేస్తారట. రాజమౌళి మహేష్ కాంబోలో ఇంతవరకు సినిమా రాలేదు. కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్నా ఇద్దరు సినిమా చేయాలనే ఆలోచన ఉన్నా వీలు కుదరట్లేదు. మరి ట్రిపుల్ ఆర్ ఇంకెన్ని సర్ ప్రైజెస్ తీసుకొస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version