అఫీషియ‌ల్‌: భార్య‌తో విడాకులు తీసుకున్న మంచు మ‌నోజ్‌

-

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఆ కుటుంబం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్‌తో పాటు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న సైతం వెండితెరపై తండ్రి నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తోంది.

ఇక మంచు విష్ణు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న‌ కుమార్తె వెరోనికాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు మనోజ్ ప్రణీత అనే అమ్మాయిని 2015 లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. క‌ట్స్ చేస్తే నాలుగు సంవ‌త్స‌రాల్లోనే వీరి వైవాహిక బంధం ముగిసింది. ఈ విష‌యాన్ని ఈ రోజు మ‌నోజ్ స్వ‌యంగా వెల్ల‌డించి అంద‌రికి షాక్ ఇచ్చాడు. బిట్స్ పిలానీలో ఉన్నత విద్య అభ్యసించిన ప్రణీత మంచు కుటుంబానికి ముందు నుంచి స‌న్నిహితురాలే. విష్ణు భార్య వెరోనికాకు ఫ్రెండ్ అయిన ఆమె మ‌నోజ్‌ను చూడ‌డం.. వారిద్ద‌రు స్నేహితులుగా మార‌డం… ఆ త‌ర్వాత ప్రేమించుకోవ‌డంతో చివ‌ర‌కు పెద్ద‌లు వారి పెళ్లి చేశారు.

అయితే కొద్ది రోజులుగా ఆమె అమెరికాలోనే ఉంటోంది. ఇక తాజాగా మ‌నోజ్ ఈ విష‌యంపై స్పందిస్తూ ఈ రోజు మీకో ముఖ్య‌మైన విష‌యం చెప్పాల‌నుకుంటున్నాన‌ని.. నా భార్య‌తో విడాకులు తీసుకున్నాన‌ని చెప్పాడు. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య కొన్ని మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేదని… అయితే ఒక‌రంటే మ‌రొక‌రికి గౌర‌వం ఉంద‌ని కూడా మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌గా రాసుకువ‌చ్చాడు. ఇక మ‌నోజ్‌కు మ‌ద్ద‌తుగా ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాల‌ని అత‌డికి స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news