BREAKING : నేడు తిరుపతి కోర్టుకు మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్…

-

తిరుపతి : నేడు తిరుపతి కోర్టుకు మంచు కుటుంబ సభ్యులైన మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వెళ్లనున్నారు. 2019 మార్చి 22న తిరుపతి మదనపల్లెలో జాతీయ రహదారిపై ఫిజు రియింబర్స్ మెంట్ చెల్లించలేదని విద్యార్థులతో కలసి ధర్నా చేశారు మంచు మోహన్ బాబు. అయితే… ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో కేసు నమోదు చేశారు తిరుపతి పోలీసులు.

అంతేకాదు.. అప్పట్లో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు మోహన్ బాబు. మంచు మోహన్ బాబు ధర్నా చేసినప్పటికీ.. ఇప్పటి అందలేదు గత ఫిజు రియింబెర్స్ మెంట్ బకాయిలు. ఎన్నికల కోడ్ ఉండగా ధర్నా చేసినందుకు గానూ.. వారిపై ఐపీసీ 290, 341, 171 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు పోలీసులు. అయితే..ఈ కేసు నిమిత్తం.. నేడు తిరుపతి కోర్టుకు మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వెళ్లనున్నారని సమాచారం. అయితే.. ఇవాళ తిరుపతి ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి పాదయాత్రగా కోర్టుకు వెళ్లనుంది మంచు ఫ్యామిలీ.  దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news