మాస్టర్,విక్రమ్ మూవీ విలన్ తో ప్రేమలో పడ్డ యంగ్ హీరోయిన్..!

-

ఈ కాలంలో హీరోయిన్లు ఎప్పుడు? ఎవరితో? ఎలా ప్రేమలో పడతారో? చెప్పడం చాలా కష్టం. అయితే కొంతమంది తమ ప్రేమ విషయాలను బయట పెడితే మరికొంతమంది రహస్యంగా మైంటైన్ చేస్తూ ఉంటారు. ఇంకొంత మంది ప్రేమించిన కొన్నాళ్లకే ఏదోక కారణం చేత విడిపోయిన వారు కూడా ఉన్నారు.. కొంతమంది ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు విలన్ క్యారెక్టర్లతో బాగా పేరు సంపాదించుకున్న వారితోనే ప్రేమలో పడుతూ ఉండడం గమనార్హం. అలాంటివారిలో ఐశ్వర్య లక్ష్మి కూడా ఒకరు ఈమె విక్రమ్ సినిమాలో విలన్ గా నటించిన అర్జున్ దాసుతో ప్రేమలో పడింది.

ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించి క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మి. తనతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసిన ఐశ్వర్య లక్ష్మి అతనితో ప్రేమలో ఉందని ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో నిజమే అనేటట్టు స్పష్టం చేసింది. తను షేర్ చేసిన ఫోటోకు లవ్ సింబల్ ని కూడా జత చేసి పోస్ట్ చేయడంతో ఇన్నాళ్లకు తామిద్దరూ ప్రేమలో ఉన్నట్టు క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కనగరాజు తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలలో విలన్ ఛాయలున్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడినట్లు సమాచారం.

కప్పెల ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న బుట్ట బొమ్మ సినిమాతో అర్జున్ దాస్ తెలుగులో అడుగుపెడుతున్నాడు. ఇదిలా ఉండగా ఐశ్వర్య లక్ష్మి షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలో ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మి కి ప్రేమ పెళ్లి ఇష్టమా.. ? పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టమా..? అని అడిగితే… ఐశ్వర్య లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని వెల్లడించి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలా మాట్లాడిన ఈమె నెల రోజులు తిరగకుండానే ఇలా అర్జున్ దాస్ ఫోటోని షేర్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news