దీవాళి మెగా సందడి.. ఫ్యాన్స్ ఖుషి

-

మెగా ఫ్యాన్స్ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ మెగా కుటుంబం అంతా ఒకచోట చేరింది. సంప్రాదయ దుస్తులు ధరించి మెగా సంబరంగా దీవాళి వేడుకలను జరుపుకున్నారు. ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప మెగాస్టార్ చిరంజీవి నుండి రేపో మాపో హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్న వైష్ణవ్ తేజ్ వరకు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిలా ప్రజా పోరాట యాత్రలో బిజీగా ఉన్నారు. అయినా మెగా వేడుకల్లో ఆయన పార్టిసిపేషన్స్ తక్కువే.

ఇక ఈ వేడుకలో చిరంజీవి, నాగబాబు, రాం చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్ లతో పాటుగా అల్లు అర్జున్ అన్నయ్య బాబి కూడా పాల్గొన్నాడు. పండుగ ఏదైనా మెగా సందడి ఉండాల్సిందే. పండుగ అంతా సరదాగా సాగిందని వీరిని చూస్తుంటేనే తెలుస్తుంది. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నా ఇలా అందరు పండుగ పూట కలుసుకోవడం మెగా ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక దీవాళి కానుకగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో రాం చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామా ఫస్ట్ లుక్ రిలీజైంది.

Read more RELATED
Recommended to you

Latest news