ఆ బాధ తట్టుకోలేక అలాంటి పని చేసిన మెగా అల్లుడు.. షాక్ లో నిహారిక..!

-

మెగా డాటర్ నిహారిక కొంతకాలంగా తన భర్త చైతన్య జొన్నలగడ్డ తో తెగ దెంపులు చేసుకుంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి విడాకులు వ్యవహారంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో వీరు చేసే పనుల వల్ల నిజంగానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇకపోతే ఆయన స్వయంగా బావమరిది వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి కూడా రాకపోవడంతో ఇక మరొకవైపు నిజంగానే వీరు విడిపోతున్నారు అన్న వార్త ఇప్పుడు మరింత వైరల్ గా మారుతుంది.

ఇకపోతే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ మాత్రం పక్కగా విడిపోయి ఉంటారు అంటూ నేటిజన్ లు మాత్రం ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా చాలాకాలంగా చైతన్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేడు.. గత నాలుగు నెలలుగా ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు. మరి ఏమైపోయాడు అన్న ప్రశ్న నెట్టింట చాలా వైరల్ గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన చివరి పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.

అటు విడాకులు వార్తపై కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ చైతన్య పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.తాజాగా చైతన్య ముంబైలోని గ్లోబల్ విపస్సనా పగోడా మెడిటేషన్ సెంటర్ ఫోటోని షేర్ చేస్తూ..నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు.. ఒక ప్రదేశానికి మనం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి ఎంతో జ్ఞానంతో తిరిగి వస్తాము ఇక ఇది చాలా తక్కువ మంది లైఫ్ లో మాత్రమే జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చి పది రోజుల నుంచి విపస్సన యోగాను చేయడం వల్ల నా లైఫ్ చాలా సంతోషంగా హాయిగా ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల ఆయన ఇలా మనశ్శాంతి కోసం యోగాశ్రమంలో చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి నిహారికా కూడా షాక్ లో ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Chaitanya Jv (@chaitanya_jv)

Read more RELATED
Recommended to you

Latest news