మెగా, సూపర్ ఈవెనింగ్ సోషల్ మీడియాను ఊపేస్తుందిగా…!

-

సూపర్ స్టార్ మాహేశ్ బాబు హీరో గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన విడుదలైన ట్రైలర్లు, లుక్స్ అన్ని కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. మహర్షి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న చిత్రం కావడంతో అభిమానులు,

ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాన్నాళ్ళ తర్వాత అలనాటి హీరోయిన్ విజయశాంతి హీరోయిన్ గా నటిస్తుండగా, మహేష్ బాబు ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రి రిలీజ్ కార్యక్రమం ఎల్బీ స్టేడియం లో జరుగుతుంది.

దీనితో మహేష్ బాబు, మెగా అభిమానులు ఈ ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఈవెంట్ హాట్ టాపిక్ గా నిలిచింది. చిరంజీవి ఎప్పుడో ఒక్కడు సినిమా కార్యక్రమానికి దుబాయ్ లో హాజరు అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకు తొలిసారి హాజరు కావడంతో మహేష్ బాబు ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మెగా సూపర్ ఈవెనింగ్ అనే ట్యాగ్ తో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news