మరో రెండ్రోజుల్లో ఓటీటీలోకి ‘ది మోస్ట్ అవైటెడ్’ వెబ్ సిరీస్

-

ఇండియాలో వెబ్ సిరీస్లలో ది బెస్ట్ ఏంటంటే.. తొలి పది సిరీస్లో కచ్చితంగా మీర్జాపూర్‌ పేరుంటుంది. ఈ సిరీస్లలోని క్యారెక్టర్లతో వచ్చిన మీమ్స్, ట్రోల్స్కు లెక్కేలేదు. భాషలతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకులను ఈ సిరీస్ను అలరించారు. అందుకే మేకర్స్ ఇప్పటికే రెండు సీజన్లతో ముందుకొచ్చారు. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి మూడో సీజన్ కూడా రూపొందించారు.

క్రైమ్‌ యాక్షన్‌ జానర్‌లో వచ్చిన ఈ సిరీస్‌ మూడో సీజన్ త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. మరో రెండ్రోజుల్లో అంటే జులై 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘సీజన్‌3’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్కు ఎంత పాపులారిటీ వచ్చిందంటే.. ఇందులోని నటీనటులను అసలైన పేర్లకంటే కూడా కాలీన్‌భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిత్‌ (అలీ ఫజల్) బబ్లూ పండిత్‌ (విక్రాంత్ మాస్సే), మున్నా భాయ్‌ (దివ్యేందు) గోలు (శ్వేత త్రిపాఠి) పేర్లతోనే ఎక్కువ పాపులర్‌ అయ్యారు. రక్తంతో రాసిన ‘మీర్జాపూర్‌’.. ఈ కథ ముందుకు సాగాలంటే మళ్లీ రక్తాన్నే కోరుతుంది అంటూ ఈ మూడో సీజన్ త్వరలో ముందుకు రాబోతుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news