Samantha: దేశంలోనే నెంబర్ వన్‍ హీరోయిన్ గా సమంత..!

-

హీరోయిన్​ సమంతకు ఉన్న క్రేజ్​కు గురించి అందరికీ తెలిసిందే. సోషల్‌మీడియాలోనూ ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్లలోనే ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె నెట్టింట్లో చురుగ్గా ఉండేవారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వేదికగా తన కొత్త సినిమాలు, డైలీ రొటీన్‌, వాణిజ్య ప్రకటనలు, లేటెస్ట్‌ ఫొటోషూట్‌లు.. ఇలా ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తుండేవారు.

ఇది ఇలా ఉండగా..సమంత ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ‘ORMAX INDIA’ నిర్వహించిన సర్వేలో జులై నెలకు సంబంధించి దేశంలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ గా సమంత నిలిచింది. ఇప్పటికే సమంతా తెలుగు హీరోయిన్లలో తొలి స్థానం దక్కించుకోగా, ఇప్పుడు ఏకంగా దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొనే, కీర్తి సురేష్, పూజ హెగ్డే, రష్మిక మందన, కత్రినా కైఫ్, కియారా అద్వానీ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news