బోయపాటికి మరో షాక్

-

భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బోయపాటి శ్రీను తన ప్రతి సినిమా వైలెన్స్ ప్రధానంగా ఎంచుకుంటూ స్టార్ డైరక్టర్ గా ఎదిగాడు. అయితే అతని సినిమాల్లో కథ ఉండదన్న టాక్ ఉంది. ఏదో స్టార్స్ ఇమేజ్ కు తగిన యాక్షన్ సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడని అంటున్నారు. లేటెస్ట్ గా వినయ విధేయ రామ సినిమాతో బోయపాటి చాలా దారుణమైన రిజల్ట్ చవిచూశాడు. ఆ సినిమా ఫ్లాప్ కు ప్రధాన కారణం బోయపాటి శ్రీనునే అనేలా విమర్శలు వచ్చాయి.

ఇదిలాఉంటే ఆ సినిమా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సెటిల్ మెంట్ టైంలో బోయపాటి శ్రీను తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వనని చెప్పడం కూడా అతనికి బాగా డ్యామేజ్ ఏర్పరచింది. అందుకే బోయపాటి శ్రీనుతో సినిమా అంటే నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కూడా ఆ అడ్వాన్స్ తిరిగి తీసుకుందట.

ఒక్క సినిమా ఫ్లాపైతే ఇంత ఘోరంగా ఉంటుందా అని అనుకోవచ్చు. దమ్ము ఫ్లాప్ అయినా బోయపాటి శ్రీనుకి అవకాశాలు వచ్చాయి కాని సినిమా తాలూఖా నష్టాలు భరించాల్సిన అవసరం తనకు లేదని చెప్పడం వల్లే నిర్మాతలు అతనంటే దూరం జరుగుతున్నారట. మరి బోయపాటి బాలకృష్ణతో సినిమా ఎనౌన్స్ చేశారు. ఆ సినిమా అయినా ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news