వామ్మో.. న‌భా న‌టేశ్ రెమ్యున‌రేష‌న్ అంత పెంచేసిందా..?

-

ఇస్మార్ట్ శంకర్‌ సినిమాలో మూవీ మేకర్లను అట్రాక్ట్ చేసిన నభా నటేశ్. ఇక ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించిన నేపధ్యంలో ఆ చిత్రంలో నటించిన రామ్ తర్వాత నభా నటేశ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందాలను ఆరబోసి యువతను చిత్తుచిత్తు చేసేసింది. ఆ వెంటనే రవితేజ సరసన రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే.. తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలతో పోలిస్తే తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కథానాయికలు అందుకునే పారితోషికమే ఎక్కువ. అలా కన్నడ సినిమాల్లో తక్కువ పారితోషికమే తీసుకుంటున్న నభా నటేశ్, తెలుగులో పారితోషికాన్ని పెంచుతూ వెళుతోందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ కోసం ఈ సుందరికి దక్కిన పారితోషికం 20 లక్షలు.

ఆ సినిమా హిట్ కావడంతో ఈ అమ్మాయి తన పారితోషికాన్ని 40 లక్షలు చేసేసింది. అదే పారితోషికాన్ని ఆమె ‘డిస్కోరాజా’ కోసం అందుకుంది. ఆ తరువాత సినిమాను ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో చేయనుంది. ఈ సినిమాకిగాను ఆమె 80 లక్షలను డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. నిర్మాతలు ఆ మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించారనే అంటున్నారు. కోటి రూపాయలకి పైగా పారితోషికాన్ని అందుకునే కథానాయికల జాబితాలో చేరిపోవడానికి నభా నటేశ్ కి ఎంతో కాలం పట్టదనే విషయం మాత్రం అర్థమైపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news