తన్ని మరీ నేర్పించండి.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

-

నాగబాబు చేసే పనులు, చెప్పే మాటలు, పెట్టే ట్వీట్స్ ఈ మధ్య రామ్ గోపాల్ వర్మను తలపిస్తున్నాయి. ఒక్కోసారి ఆర్జీవీని మించి పోయాడేమోనన్న అనుమానం కూడా వస్తుంది. నాగబాబు కరోనా వైరస్ మీద, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద చేసే వ్యంగ్యాస్త్రాలు చూస్తుంటే నాగబాబు కూడా వర్మ దారిలోకు వెళ్లాడనిపిస్తోంది.

 

కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటి నుంచి నాగబాబు చేసే ట్వీట్స్ సెన్సేషనల్ అవుతున్నాయి. కరోనా నుంచి దేవుడు రక్షించడలేడని, దేవుడు, స్వామిజీలు ఏమీ పీకలేరని.. వెళ్లి డాక్టర్లు, సైంటిస్టుల కాళ్లు మొక్కుదాం వారే మనల్ని కాపాడగలరని సంచలన కామెంట్స్ చేశాడు.

కరోనా కట్టడికి దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం తమ బాధ్యతను మరిచి రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా వినడం లేదు. అయితే వీటిపై నాగబాబు తాజాగా ఓ కామెంట్ చేశాడు. ‘ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది.”మనం ప్రజలకి హక్కులు నేర్పాము.బాధ్యతలు నేర్పలేదు”అక్షర సత్యం …ఈ తప్పు ప్రభుత్వం వారిదే.మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది.నేను కూడా అతితుడ్ని కాదు.మా ప్రజలందరికీ తన్ని బాధ్యతలు నేర్పించండి.నేర్చుకుంటామ’ని పేర్కొన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news