కేంద్రానికి, తెలుగు రాష్ట్రాలకు పవన్ భారీ విరాళం…!

-

కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకి వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన భారీ సాయం చేసారు. కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి గానూ అందరూ కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. ఎవరికి వారుగా అందరూ కూడా ముందుకి వచ్చి తమ వంతు సాయం చేయడం గమనార్హం. సిని ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా సాయం చేస్తున్నారు.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తమ వంతు సాయం చేసారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు కోట్ల రూపాయల సాయం చేసారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్టుగా ప్రకటించారు. దేశాన్ని ఆదుకోవడానికి ప్రతీ ఒక్కరు కూడా ముందుకి రావాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో దేశానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పవన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. దీనిపై స్పందించిన దర్శకుడు హరీష్ శంకర్… “ఇంకా సినిమాలు ఎందుకు అని అనకండి… కొంతమందికి సినిమా అవసరం.. కొంతమంది సినిమాకి అవసరం” అని ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news