మెగాబ్రదర్ నాగబాబుకు కరోనా ?

-

తెలుగు రాష్ట్రాల్లో కరోన తన విశ్వరూపం చూపుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు కరోనా కేసుల్లో పోటీ పడుతున్నాయి. ఇక ఈ కరోనా సామాన్యులకే కాక సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. కరోన లాక్ డౌన్ సడలింపులలో భాగంగా టీవీ షూట్స్‌ కి పర్మిషన్స్ ఇచ్చిన నాటి నుండి ఆ షూట్స్ లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. ఈరోజు లక్షణాలు కనిపించడంతో కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నారు.

అయితే ఈ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం హౌస్ క్వారెంటైన్ లోకి వెళ్ళిపోయారు. నాగబాబు తెలుగు టెలివిజన్‌లో ఒక షో చేస్తున్నారు. ఇది కాక ఆయన తన కుమార్తె నిహారికాతో ఓ ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఈ షూట్ సమయంలో, ఆయనకి వైరస్ వచ్చిందని అంటున్నారు. ఇక షూట్స్ కి వెళ్ళిన అనేక మంది తెలుగు టీవీ తారలు, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి సినీ ప్రముఖులు కూడా అలానే ఈ వైరస్ కి ఎఫెక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని నాగబాబు అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news