బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నమ్రతా శిరోద్కర్ పేరు !

-

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెర మీదకు నమ్రతా శిరోద్కర్ పేరు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. నమ్రత పేరును నేషనల్ మీడియా ప్రస్తావించినట్టుగా మీడియాలో కధనాలు వస్తున్నాయి. టాలెంట్ మేనేజర్ జయ సాహోతో నమ్రత చాటింగ్ చేసినట్టు కధనాలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్‌ కేసులో ఒక్కొక్కటిగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముందుగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, దీపికా మేనేజర్ కరిష్మా పేర్లు వినిపించాయి.

తాజాగా టాలీవుడ్ సుపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమత్ర శిరోద్కర్ పేరుకూడా తెరపైకి రావడంతో పెను సంచలనం రేగింది. బాంబేలో మంచి md ఇస్తానని ప్రామిస్ చేశావ్..MD ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందామని టాలెంట్ మేనేజర్ జయ సాహోతో నమ్రత చాటింగ్ చేసినట్టు కధనాలు వస్తున్నాయి. నిజానికి సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ… రియాను ప్రశ్నించింది. ఆమె 25 మంది పేర్లు బయటపెట్టిందని ప్రచారం జరిగింది. అప్పటినుంచి ఒక్కొక్కటిగా కొత్త పేర్లు బయట పడుతున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా నమ్రత పేరు తెర మీదకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news