వద్దు సమంతా.. అలా చేయకు ప్లీజు..!

-

సమంత ఏం చేసింది అంటారా? ఆమె ప్రస్తుతం కుర్ కురే ప్రాడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అదే ఇప్పుడు ఆమె కొంప ముంచినట్టుంది. కుర్ కురే బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి.. కాస్త.. ఆ బ్రాండ్ ను పొగుడుకుంటూ సమంత తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ట్వీట్ చేసింది.

కుర్ కురేతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కుర్ కురే తన 20వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త కుర్ కురేను మీ ముందుకు తీసుకొచ్చింది. అదే జింజెల్లీ ఆయిల్ లో చేసిన కుర్ కురే మసాలా మంచ్ ను కుర్ కురే తీసుకువచ్చింది. ఈ సరికొత్త చట్ పటా మీకు నచ్చుతుందనుకుంటున్నా. అంటూ ట్వీట్ చేసింది సమంత.

అయితే.. ఆ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది. అయ్యో సమంత. పోయి.. పోయి.. ఆ కుర్ కురే బ్రాండ్ కు ఎందుకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నావు. అవి ఆరోగ్యానికి హానికరం. ఇలా హానికరమైన ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేసేముందు కాస్త ఆలోచించు. వద్దు సమంతా.. నవ్వు అలా చేయకు. కొంచెం బాధ్యతగా ఉండు. ఇప్పుడు ఉన్న కాస్త ఇమేజ్ ను కూడా పాడు చేసుకోకు.. అంటూ కొంతమంది సలహాలు ఇచ్చారు. మరికొంతమంది మాత్రం డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.


కాగా గ‌తంలో కుర్ కురే ప్రొడ‌క్ట్స్‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద దుమారం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. కుర్ కురే తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆ విష‌యంపై కుర్ కురే త‌యారీదారు పెప్సీ కో స్పందించింది. కుర్ కురే లో ఎలాంటి హానికారక ప‌దార్థాలు లేవ‌ని, అవి పూర్తిగా సురక్షిత‌మని చెప్పింది. అప్ప‌ట్లో ఆ వివాదం ముగిసింది. కానీ ఇప్పుడు స‌మంతా చేసిన యాడ్‌తో మ‌రోసారి నెటిజ‌న్లు ఆ విషయాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పుడు కూడా పెప్సీ కో స్పందిస్తూ.. కుర్ కురే సుర‌క్షిత‌మైన‌దేన‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news