కార్తికేయ2 పోస్ట్ పోన్ పై అసహనం వ్యక్తం చేస్తున్న నిఖిల్..వీడియో వైరల్..!!

-

నిఖిల్ సిద్ధార్థ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రావాలనేది ఆయన కల.. ఈ క్రమంలోని తన నటనను కనబరుచుకోవడానికి మొదటిసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే అతి కొద్ది మందిలో ఇతను సెలెక్ట్ కావడంతో లక్ష రూపాయలు ఇస్తే తప్ప ఇండస్ట్రీలోకి అవకాశం ఇవ్వము అని చెప్పేసరికి.. ఎలాగైనా సరే ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికతో ఆ పాత్ర తనకే దక్కాలనే ఆశతో లక్ష రూపాయలు ఇచ్చి మరీ హ్యాపీడేస్ సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఇమేజ్ను సొంతం చేసుకోగలిగారు.Karthikeya 2: New release date announced- Newsఇదిలా ఉండగా గత రెండు మూడు సంవత్సరాల కిందట కార్తికేయ సినిమాతో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించిన నిఖిల్.. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో మళ్ళీ ప్రేక్షకులకి డబుల్ థ్రిల్ ఇవ్వడానికి మళ్లీ సిద్ధమయ్యాడు. ఇక ఈ క్రమంలోనే నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు ఇదిలా ఉండగా ఆగస్టు 12వ తేదీన సినిమాను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆగస్టు 13వ తేదీకి పోస్ట్ పోన్ చేయవలసి వచ్చింది. కానీ ఇదే విషయంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ప్రమోషన్స్ లో కొన్ని విషయాలను కూడా వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది.కార్తికేయ2 సినిమా పోస్ట్ పోన్ పై మీ అభిప్రాయం ఏమిటి అని యాంకర్ నిఖిల్ ను ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా నిఖిల్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ బాగుండాలి.. ఇండస్ట్రీలో గొడవలు జరగకూడదు అని నిర్ణయించుకున్నాము.. కానీ ప్రతిసారి మా సినిమానే పోస్ట్ ఫోన్ చేయమని చెప్పడం మాత్రం చాలా బాధ కలిగించింది. ఒక రకంగా ఎందుకు మమ్మల్నే ప్రతిసారి వెనక్కి తగ్గమని చెప్తారు.. ఇలా చెప్పడం చాలా బాధేసింది అంటూ అసహనం వ్యక్తం చేశారు నిఖిల్. ఇక బడా నిర్మాతలంతా తమ సినిమాలను ముందు విడుదల చేస్తూ.. మా సినిమా నున్వాయిదా వేసుకోమని చెప్పడంతో బాధగా వుంది అంటూ ఆయన తన బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news