బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సిద్దమైన నితిన్ …!

-

రీసెంట్ గా యంగ్ హీరో నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించిన ‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అందుకొని మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సస్ తో ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు నితిన్. ఈ సినిమా తర్వాత వరసగా సినిమాలను చేసేందుకు ప్లాన్స్ వేసుకున్నాడు.

 

ప్రస్తుతం నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన రొమాంటిక్ పోస్టర్ తో మంచి అంచనాలను పెరిగాయి. తొలిప్రేమ, మజ్ను లతో సక్సస్ లను అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా జూలై లో రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ లు కూడా పూర్తి చేసుకుంది. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్‌ నితిన్‌కు జోడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు నితిన్ హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అంధాదున్ రీమేక్‌లోనూ నటించనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. ఇనాళ్ళు లాక్ డౌన్ కారణంగా ఆగిన ఈ సినిమాలన్ని ఒక్కొక్కటిగా మళ్ళీ పట్టాలెక్కబోతున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news