విక్రమ్ మూవీ మ్యాజిక్ రిపీట్ చేయాలను కుంటున్న నితిన్ .!

-

తెలుగు సినిమా పరిశ్రమ లోని నిర్మాత లు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. మొదటగా హీరో నితిన్ మరియు వారి తండ్రి సుధాకర్ రెడ్డి లు విక్రమ్ సినిమా ను తెలుగు లో డబ్ చేసి ఊహించని రీతిలో లాభాలు పొందిన విషయం తెలిసిందే. ఇక అల్లు అరవింద్ గారు  కాంతారా అనే కన్నడ సినిమా ను డబ్బింగ్ చేసి తెలుగు లో రిలీజ్ చేసి  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమా  పెట్టిన డబ్బుకు ఎన్నోరెట్లు డబ్బులు వసూలు చేసి పెట్టింది.

ఇక ఆ తర్వాత కింగ్ నాగార్జున కూడా  కార్తీ సినిమా సర్దార్ ను డబ్ చేసి రిలీజ్ చేశాడు. ఈ సినిమా కూడా మంచి లాభాలు వచ్చేలా చేసింది.ఇదే క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కూడా ‘లవ్ టుడే’ సినిమాని డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా కూడా కోట్లులాభాలను దిల్ రాజు జేబులో వేసింది. దీనితో తెలుగు నిర్మాతలు అందరిలో ఇదే ఆలోచనా దోరణి లో ఉండిడబ్భులు సంపాదించుకుంటున్నారు.

ప్రస్తుతం నితిన్ మరో డబ్బింగ్ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నాడు. ఆ సినిమా  నే కన్నడ నుంచి భారీ అంచనాలు నడుమ వస్తున్న “కబ్జా.  ఈ చిత్రంలో తెలుగు వారికి పరిచయం అయిన ఉపేంద్ర హీరోగా నటించగా కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటించారు. నితిన్ తమ బ్యానర్స్ రుచిర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్ సినిమాస్ తో రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.. ఇక ఈ భారీ చిత్రం ఈ మార్చ్ 17 న రిలీజ్ కాబోతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news